హైదరాబాద్, జూలై 8: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో..రెనో సిరీస్లో మరో రెండు రకాల ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెనో 16 సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ ఫోన్లు రూ.49,999 నుంచి రూ.67,999 గరిష్ఠ ధరల్లో లభించనున్నాయి. వీటిలో రెనో 16 5జీ మాడళ్లలో 8జీబీ+128 జీబీ రకం రూ.61,999, 8జీబీ+256 జీబీ రకం రూ.67,999, అలాగే రెనో 16సీ 5జీ మాడళ్లలో 8జీబీ+128 జీబీ రకం రూ.46,999గాను, 8జీబీ+256 జీబీ రకం రూ.49,999, 12జీబీ+256 జీబీ మాడల్ రూ.55,999గా నిర్ణయించింది. గురువారం నుంచి అమెజాన్తోపాటు ఫ్లిప్కార్ట్, రిటైల్ అవుట్లెట్లు, ఒప్పో ఈ-స్టోర్లలో కూడా ఈ స్మార్ట్ఫోన్లు లభించనున్నాయి. ఈ సందర్భంగా పలు బ్యాంకుల క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి 10 శాతం క్యాష్బ్యాక్, జీరో డౌన్పేమెంట్తో 18 నెలల్లో చెల్లింపులు జరిపేలా కొనుగోలు చేయవచ్చు. 6.32 ఇంచుల అమోలెడ్ టచ్స్క్రీన్, 50 మెగాపిక్సెల్ కెమెరాలు, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 6700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఏఐ ఫీచర్స్తో తయారు చేసింది.