న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: దేశంలో అతిపెద్ద టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. జూలై నెలలో సంస్థ మరో 29.3 లక్షల మంది మొబైల్ సబ్స్ర్కైబర్లు చేరారు. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. సునీల్ మిట్టల్కు చెందిన భారతీ ఎయిర్టెల్ నెట్వర్క్ను 5.13 లక్షల మంది ఎంచుకోవడంతో మొత్తం సంఖ్య 36.34 కోట్లకు చేరుకుంది. కానీ, వొడాఫోన్ ఐడియా మాత్రం 12.42 లక్షల మంది సబ్స్ర్కైబర్లను కోల్పోయింది.