హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తేతెలంగాణ): కాలం మారుతున్న కొద్ది సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నది. తాజాగా క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ కలిగిన వర్చువల్ను పీసీలను అందుబాటులోకి తీసుకువస్తున్నది రిలయన్స్ కంపెనీ. ఇది జియో ట్రూ 5జీని ఉపయోగించుకొని క్లౌడ్లో హోస్ట్ చేయబడిన వర్చువల్ పీసీగా ఉంటుంది.ఈ క్లౌడ్ పీసీని వ్యాపార సంస్థలు, వృత్తినిపుణులు, విద్యార్థులు అవసరాలకు వీలుగా సరమైన ధరల్లోనే అందుబాటులోకి తీసుకువస్తామని రిలయన్స్ ప్రకటించింది.
హార్డ్వేర్ కొనక్కర్లేదు
క్లౌడ్ పీసీని ఉపయోగిస్తే కంప్యూటర్ హార్డ్వేర్ పరికరాలను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో ఖర్చు ఆదా అవుతుంది. త్వరలోనే 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తుండ టంతో నిరంతరం అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్తో క్లౌడ్ పీసీలు అనుసంధానమై ఉంటాయని, పరికరం ఒక గేమ్ చేంజర్గా ఉంటుందని రిలయన్స్ తెలిపింది. ఈ వర్చువల్ క్లౌడ్ పీసీలను అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం రాదని, వాటిని ఉపయోగించిన మేరకే చెల్లింపులు చేసే విధానం అందుబాటులో ఉంటుందని జియో ప్లాట్ఫామ్ సీఈవో కిరణ్ థామస్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ధరలు వెల్లడించని కంపెనీ జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత జియో క్లౌడ్ పీసీని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.