Redmi A3x | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ తన రెడ్మీ ఏ3ఎక్స్ ఫోన్ను త్వరలో భారత్, గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరిస్తామని తెలిపింది. ఇది గత ఫిబ్రవరిలో మార్కెట్లో ఆవిష్కరించిన రెడ్మీ ఏ3 అప్ గ్రేడెడ్ ఫోన్ గా వస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్ మీ ఏ3ఎక్స్ ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్తోపాటు 6.71 అంగుళాల ఎల్ సీడీ స్క్రీన్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ లభిస్తుంది. యూనిసోక్ టీ603 చిప్ సెట్, 3జీబీ లేదా 4జీబీ ర్యామ్ తో వస్తుందీ ఫోన్.
ఏఐ ఫేస్ అన్ లాక్ ఫీచర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లు ఉంటాయి. 8-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ రేర్ కెమెరా, 0.08 మెగా పిక్సెల్ డెకోరేటివ్ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 10వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. గ్రీన్, గ్రే రంగుల్లో లభిస్తుందీ ఫోన్. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ యూఐ వర్షన్ పై పని చేస్తుంది.
ఇంతకుముందు భారత్ మార్కెట్లోకి వచ్చిన రెడ్మీ ఏ3 ఫోన్ 3జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,299, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,299, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,299లకు లభిస్తుంది. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్, లేక్ బ్లూ, ఆలీవ్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది.