న్యూఢిల్లీ, జూలై 1: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) డీన్గా ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్గనైజేషనల్ బిహేవియర్పై పట్టున్న మదన్ను గతేడాది డిసెంబర్లోనే కొత్త డీన్గా ఎంపికచేశారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో పలు బాధ్యతలు నిర్వహించిన ఆయన తొలినాళ్ల నుంచి ఐఎస్బీతో అనుబంధం కలిగివున్నారు. పదవీ కాలాన్ని ముగించిన రాజేంద్ర శ్రీవాస్తవ నుంచి ఈ 1న మదన్ బాధ్యతలు స్వీకరించినట్లు ఐఎస్బీ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.