ముంబై, మే 16: కార్లను కొనాలనుకున్నవారి ఆశల్ని కరోనా వైరస్ ఆవిరి చేసేసింది. మహమ్మారి దెబ్బకు తమ ఆదాయం తలకిందులు కావడంతో చాలామంది కారు కొనుగోలు ప్రయత్నాలు, నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా సర్వే ప్రకారం.. ప్రవేశస్థాయి కార్లు లేదా అప్గ్రేడ్ మోడల్స్ను కొనాలనుకున్నవారు కరోనా పరిస్థితుల నేపథ్యంలో వెనక్కి తగ్గినట్టు తేలింది. ఇక సోమవారం విడుదలైన ఈ రిపోర్టులో సంపన్నుల ఆదాయం స్థిరంగానే ఉన్నందున లగ్జరీ లేదా ఖరీదైన కార్ల మార్కెట్కు వచ్చిన ఇబ్బందేమీ లేదని కూడా స్పష్టమైంది. అలాగే టూవీలర్ల మార్కెట్లోనూ ప్రీమియం బైక్ల వాటా దాదాపు 40 శాతంగానే ఉండే అవకాశాలున్నాయి. ఇక రూ.10 లక్షలకుపైగా విలువైన కార్లు ప్రీమియం సెగ్మెంట్లోకి పడిపోవడం, రూ.70 వేలు, ఆపై ధర కలిగినవి కూడా అధిక ధరల కేటగిరీలోకి వెళ్లిపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం ప్రీమియం సెగ్మెంట్ కార్లు.. తక్కువ ధర కార్లతో పోల్చితే ఐదు రెట్లు వేగంగా అమ్ముడయ్యాయి. ఇక మారుతీకి చెందిన ఆల్టో, స్విఫ్ట్, బాలెనో, విటారా, బ్రెజ్జా, సెలీరియో, డిజైర్, హ్యుందాయ్కి చెందిన ఐ10, ఐ20 కార్లను కనిష్ఠ ధరల్లో కస్టమర్లు ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపేవారని, గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో వీటికి కాస్త ఆదరణ కరువైందని సర్వేలో తేలింది.