న్యూఢిల్లీ, మే 31: రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) చార్జీలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) పెంచింది. మే 20 నుంచే పెంపు అమల్లోకి వచ్చినట్టు మంగళవారం ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ తెలియజేసింది.
నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (నాచ్) ఈ-మ్యాండేట్ చార్జీలనూ బ్యాంక్ సవరించింది. ఈ చార్జీలను రూ.100గా నిర్ణయించింది. మే 28 నుంచి వర్తిస్తుంది. ఇక పెరిగిన చార్జీలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అదనమని కూడా బ్యాంక్ పేర్కొన్నది.