Phonepe | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: దేశీయ వినియోగదారుల కోసం బుధవారం ఓ కొత్త మొబైల్ అప్లికేషన్ (మొబైల్ యాప్) స్టోర్ను పరిచయం చేసింది ఫోన్పే. గూగుల్ ప్లే స్టోర్కు పోటీగా వచ్చిన ఈ ఆండ్రాయిడ్ ఆధారిత స్టోర్ను ఇండస్ యాప్స్టోర్గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్గా భారత్ ఉన్నది.
ఈ క్రమంలోనే పెరుగుతున్న మొబైల్ వినియోగాన్ని అందిపుచ్చుకుని సంస్థాగతంగా మరింత వృద్ధి చెందాలన్న ఆలోచనతో ఇండస్ యాప్స్టోర్ను ఫోన్పే తెచ్చింది. దీన్ని భారతీయ డిజిటల్ ప్రయాణంలో ఓ గొప్ప మార్పుగా ఫోన్పే అభివర్ణిస్తున్నది. ఈ కొత్త యాప్ను వినియోగదారులు సమర్థవంతంగా వాడుకునేలా ఓ షార్ట్-వీడియోను సైతం ఫోన్పే.. ఈ యాప్స్టోర్లో అందుబాటులోకి తీసుకురావడం విశేషం.
మరోవైపు ఈ యాప్స్టోర్ వినియోగాన్ని పెంచేలా ఆయా స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలతోనూ భాగస్వామ్యానికి ఫోన్పే ప్రయత్నిస్తున్నది. ఇక ప్రత్యేకంగా భారతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ సందర్భంగా తెలిపారు.