న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలతో కొట్టుమిట్టాడుతున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ బ్యాంక్ ఎండీ, సీఈవో సురీందర్ చావ్లా తప్పుకున్నారు. సోమవారమే ఆయన రాజీనామా చేసినట్టు మంగళవారం పీపీబీఎల్ తెలియజేసింది. ఇందుకు వ్యక్తిగత కారణాలను పేర్కొన్నది. గత ఏడాది జనవరిలో చావ్లా ఈ సంస్థలో చేరారు. కాగా, ఈ ఏడాది జనవరిలో.. నిబంధనల ఉల్లంఘన, నిర్లక్ష్య వైఖరికిగాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. కస్టమర్లకు చెందిన ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్స్, ఇతర సాధనాల్లో డిపాజిట్లు, టాప్అప్లను అంగీకరించరాదని ఆదేశించిన సంగతీ విదితమే.