Aadhaar-Pan Link | పాన్తో ఆధార్ను అనుసంధానానికి సంబంధించిన గడువును మరోసారి కేంద్రం పొడిగించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా.. జూన్ 30 వరకు పొడించింది. ఇప్పటికే పలుసార్లు గడువు పొడిగిస్తూ వస్తున్న ఆర్థికశాఖ మరోసారి అవకాశం ఇచ్చింది. తప్పనిసరిగా గడువులోగా పాన్కార్డుకు ఆధార్ను లింక్ చేసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. లేకపోతే జూలై ఒకటో తేదీ నుంచి పాన్ కార్డ్ పని చేయదని హెచ్చరించింది.
దాంతో ఇకపై పాన్తో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పనులు చేయలేరని స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడం భారీ లావాదేవీలు చేయడం నిలిచిపోవడంతో పాటు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రానున్నది. బ్యాంక్ అకౌంట్తో పాటు డీమ్యాట్ అకౌంట్ తెరవడంతో సాధ్యం కాదు. అలాగే మ్యూచ్యువల్ ఫండ్స్లో పెట్టుబడికి నిబంధనలు అడ్డురావడంతో పాటు ఐటీ రిటర్నులను సైతం దాఖలు చేయలేని పరిస్థితి నెలకొంటుంది.