Aptronix | న్యూఢిల్లీ, డిసెంబర్ 16: యాపిల్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని వీటిని విక్రయిస్తున్న ఆప్ట్రానిక్స్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 స్టోర్లు ఉండగా, వచ్చే మార్చి నాటికి ఈ సంఖ్యను 100కి పెంచుకోనున్నట్టు ప్రకటించింది. 2011లో హైదరాబాద్లో తన తొలి స్టోర్ను ప్రారంభించిన సంస్థ.. రిటైల్ స్టోర్ల సంఖ్యను 60కి పెంచుకోవడంతోపాటు 20 నగరాల్లో 16 సర్వీస్ సెం టర్లను నెలకొల్పింది.
మరో వైపు, ఆప్ట్రానిక్స్.. చెన్నైలో తన తొలి అతిపెద్ద స్టోర్తోపాటు, ముంబైలో యాపిల్ ప్రీమియం రీసెల్లర్ స్టోర్లను ప్రారంభించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కంటెస్ట్ను నిర్వహించింది. ఈ కంటెస్ట్లో గెలుపొందిన వారు ఐఫోన్ 15 ప్రో, రూ.20,500 విలువైన గిఫ్ట్ వోచర్లను గెలుచుకునే అవకాశం కూడా సంస్థ కల్పించింది. అలాగే రెండో బహుమతి కింద యాపిల్ వాచ్ సిరీస్ 8, ఎయిర్పాడ్స్ ప్రోతోపాటు గిఫ్ట్ వోచర్లు అందిస్తున్నది.