హైదరాబాద్, జూలై 31: స్మార్ట్ఫోన్ల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైనా ఒప్పో.. రెనో సిరీస్లో మరో మూడు మాడళ్ళను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.32,999గా నిర్ణయించింది. 6.7 అంగుళాల ఆమోలెడ్ తాకేతెర కలిగిన ఈ మొబైళ్లను 3డీ కర్వ్ డిజైన్ చేసింది. అత్యంత శక్తివంతమైన 64 మెగాపిక్సెల్ కెమెరాతో రూపొందించిన ఈ మాడల్లో ముందుభాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, కేవలం 47 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీ రీచార్జి కానున్నది. ఒప్పో రెనో 10 ప్రొ ధర రూ.39,999, రెనో ప్రో ప్లస్ ధర రూ.59,999గా నిర్ణయించింది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగివుండనున్నది.