హైదరాబాద్, మే 22: ఒప్పో ఎఫ్23 5జీ మొబైల్ విడుదలైంది. దీని ధర రూ.24,999. దేశవ్యాప్తంగా ఉన్న ఒప్పో స్టోర్లతోపాటు ఇతర రిటైల్ ఔట్లెట్లు, అమెజాన్లో ఈ నయా మొబైల్ అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. కాగా, తెలంగాణలో ఎఫ్21 సిరీస్కు విశేష ఆదరణ లభించిన నేపథ్యంలో ఇక్కడి మార్కెట్పై ఒప్పో భారీ అంచనాల్నే పెట్టుకున్నది.