న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగదారులకు మరింత ఉత్సాహాన్నిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ).. ఆయా లావాదేవీలకున్న పరిమితుల్ని పెంచింది. ఈ నెల 15 నుంచి పర్సన్-టు-మర్చంట్ (వ్యక్తులు-వ్యాపారుల మధ్య) చెల్లింపులు ఇంకా పెద్ద మొత్తాల్లో చేసుకోవచ్చని తాజాగా పేర్కొన్నది. దీంతో ఆయా రంగాల్లో డిజిటల్ పేమెంట్స్ ఊపందుకునే వీలున్నది. మరోవైపు చెక్కులు లేదా బ్యాంక్ శాఖల ద్వారా జరిగే లావాదేవీలు తగ్గిపోనున్నాయి. కాగా, పర్సన్-టు-పర్సన్ (వ్యక్తులు-వ్యక్తుల మధ్య) లావాదేవీకున్న పరిమితి మాత్రం రోజుకు లక్ష రూపాయలుగానే ఉన్నది. ఇందులో ఎలాంటి మార్పూ లేదు. ఇక ఎన్పీసీఐ తాజా వివరాల ప్రకారం..