మహబూబాబాద్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కొండంత అండ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గూడూరు మండలంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మహబూబాబాద్ ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెండ్లి సందర్భంగా తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కో ఆప్షన్ ఎండీ ఖాసీం, ఎంపీపీ సుజాత, జెడ్పీటీసీ సుచిత్ర, వైస్ ఎంపీపీ ఆరే వీరన్న, బొడ కిషన్, రహీం, లక్ష్మణ్ రావు, తదితరులు పాల్గొన్నారు.