ముంబై, జూన్ 2: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీ వాహనాల్లో నెక్సాన్..సరికొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.14.49 లక్షలుగాను, గరిష్ఠంగా రూ. 19.54 లక్షలుగా నిర్ణయించింది.
26 సెంటిమీటర్ల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, హెచ్డీ రియర్ కెమెరా, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆరు భాషల్లో వాయిస్ కంట్రోల్ చేసే విధంగా ఈ నూతన వెర్షన్ను తీర్చిదిద్దినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.