హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్(ఈ2ఈ)’లాంటి అంతర్జాతీయ వేదికలతో వ్యాపార వేత్తలు, ఎగుమతిదారులు, యువతకు కొత్త అవకాశాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఈ మేరకు గురువారం సచివాలయంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ప్రతినిధులతో కలిసి ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్’ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణను గ్లోబల్ బిజినెస్గా నిలబెట్టడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతున్నదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వ్యాపారులు, ఎగుమతిదారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.