హైదరాబాద్, మే 17: మట్టి నాణ్యతను పరీక్షించే సరికొత్త పరికరాన్ని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది ఏరోస్ ఆగ్రో. 250 గ్రాముల బరువుండే ఈ భూపరిక్షక్ ఆరు అంగుళాల చిన్న పరికరంతో కేవలం రెండు నిమిషాల్లోనే మట్టి నాణ్యతను పరీక్షించవచ్చునని కంపెనీ వర్గాలు వెల్లడించారు. మొబైల్ ఫోన్లో ఉండే యాప్తో ఈ భూపరిక్షక్ పరికరాన్ని అనుసంధానం చేసుకోవచ్చునని తెలిపారు.