న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..మళ్లీ మార్కెట్లోకి నయా బాలెనోను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ సరికొత్త వెర్షన్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ కోసం ముందస్తు బుకింగ్లను సైతం ప్రారంభించింది కూడా. ఈ నూతన వెర్షన్ను ఈ నెల చివర్లో విడుదల చేయబోతున్నది. ప్రస్తుతం 23 శాతంగా ఉన్న ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ మరింత బలోపేతం అవడానికి ఈ వాహనం ఎంతో ఉపయోగపడనున్నట్లు కంపెనీ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. హ్యుందాయ్ ఐ20, టాటా మోటర్స్ అల్ట్రోజ్, ఫోక్స్వ్యాగన్ పొలోలకు పోటీగా సంస్థ ఈ వాహనాన్ని విడుదల చేసింది. పాత మోడల్తో పోలిస్తే ఈ సరికొత్త రకం వాహనంలో అడ్వాన్స్ ఫీచర్స్తో తీర్చిదిద్దినట్లు, ముఖ్యంగా లీటర్ పెట్రోల్కు 22 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నట్లు చెప్పారు. రూ.11 వేలు ముందస్తుగా చెల్లించి నూతన బాలెనోను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.