న్యూఢిల్లీ : న్యూ ఎంజీ జడ్ఎస్ ఈవీ ఫేస్లిఫ్ట్ సేల్స్ భారత్లో మార్చి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. కంపెనీ ఇప్పటికే కారు ఎక్ట్సీరియర్, ఇంటీరియర్లతో కూడిన ఇమేజ్లను విడుదల చేసింది. న్యూ జడ్ఎస్ ఈవీ ఫ్రంట్, రియర్ సైడ్ ఎల్ఈడీ లైటింగ్తో కస్టమర్ల ముందుకు రానుంది.
అలాయ్ వీల్ డిజైన్ కొత్తగా జోడించగా బాడీ కలర్డ్ ప్యానెల్ రూపంలో మరో మార్పును జోడించారు. ఫ్రంట్, రియర్ బంపర్స్ను అప్గ్రేడ్ చేశారు. ఇక కారులోపల 2022 ఎంజీ జడ్ఎస్ ఈవీ యాపిల్ కార్ప్లేతో 10.1 ఇంచ్ టచ్స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్తో అందుబాటులో ఉంటుంది.
కొలిజన్ డిటెక్షన్, ఆటోమేటెడ్ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, 360 డిగ్రీ కెమెరా వ్యూ వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగిఉంది. ఇక 2022 ఎంజీ జడ్ఎస్ ఈవీ గత వెర్షన్ ధర రూ 21.50 లక్షల కంటే కొద్ది మొత్తం అధికంగా ఉండే అవకాశం ఉంది. భారత్లో ప్రస్తుతం ఎంజీ జడ్ఎస్ ఈవీ అప్డేటెడ్ వెర్షన్ హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్తో పోటీ పడనుంది.