న్యూఢిల్లీ: రుణాల ఊబిలో చిక్కుకున్న వీడియో కాన్ ఇండస్ట్రీస్ను స్వాధీనం చేసుకునేందుకు వేదంతా సమర్పించిన ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదంపై నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ముంబై బెంచ్ స్టే విధించింది. రూ.3000 కోట్ల విలువైన ప్లాన్తో సమర్పించిన వేదంతా సమర్పించిన ప్రణాళికపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఎఫ్సీఐ పిటిషన్లు దాఖలు చేశాయి.
ఈ రెండు సంస్థల పిటిషన్పై స్పందించిన ఎన్సీఎల్ఏటీ.. ఈ కేసు తదుపరి వాయిదాను సెప్టెంబర్ ఏడో తేదీ వరకు వాయిదా వేసింది. గత నెలలో వీడియో కాన్ స్వాధీనానికి వేదాంత ప్రణాళికతో కూడిన నివేదికను సమర్పించింది. మూడు వారాల్లోపు మూడు పేజీల్లో అభిప్రాయాలు తెలుపాలని అన్ని వాటాదారులను ఆదేశించింది.
ఎన్సీఎల్టీ ఆర్డర్కు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్లు.. రిజొల్యూషన్ ప్లాన్లో ప్రతిపాదించిన ప్రణాళికతో పోలిస్తే 90-95% కోత విధించారని ఆరోపించారు. రూ.65 వేల కోట్ల ఆస్తులకు గాను రూ.62,100 మాఫీ చేయడం అంటే ప్రజల సొత్తును కోల్పోవడమేనని పేర్కొన్నారు.