హైదరాబాద్, ఆగస్టు 10: రాష్ర్టానికి చెందిన క్షిపణుల తయారీ సంస్థ ఎంటార్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికానికిగాను రూ.152.6 కోట్ల ఆదాయంపై రూ.20.3 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది.
ఆదాయం 67 శాతం పెరగగా, లాభంలో 25.4 శాతం చొప్పున పెరిగాయి. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..వచ్చే త్రైమాసికాల్లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉన్నదని, ఈ ఏడాది చివరినాటికి ఆర్డర్ బుక్ సైజ్ రూ.1,500 కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు.