One Plus | హైదరాబాద్, ఏప్రిల్ 10: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్కు దేశీయ రిటైలర్లు షాకిచ్చాయి. మే 1 నుంచి కంపెనీకి చెందిన స్మార్ట్ఫోన్లను విక్రయించబోమని ది సౌత్ ఇండియా ఆర్గనైజెడ్ రిటైలర్స్ అసోసియేషన్(ఓఆర్ఏ) అల్టిమేటం జారీ చేసింది. కంపెనీకి చెందని మొబైళ్లను విక్రయించడంతో మార్జిన్లు అధికంగా ఉండటం లేదని, కొన్ని ఇతర సమస్యలను వన్ప్లస్ పట్టించుకోవడం లేదన్న కారణంతోనే వచ్చే నెల 1 నుంచి విక్రయాలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు వన్ప్లస్ టెక్నాలజీ ఇండియా సేల్స్ డైరెక్టర్ రంజిత్ సింగ్కు రాసిన లేఖలో ఓఆర్ఏలో పేర్కొన్నది. దీనిపై వన్ప్లస్ అధికారులు స్పందించడానికి నిరాకరించారు.