Mahindra &Mahindra | దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్ఆర అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) తయారు చేసే అన్ని రకాల వాహనాలపై 2.5 శాతం ధరలు పెంచనున్నట్లు తెలిపింది. ఈ మేరకు గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. కార్లు, ట్రక్కులు వాటి మోడళ్లు, వేరియంట్లను బట్టి మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) వాహనం ధరలు రూ.10 వేల నుంచి రూ.63 వేల వరకు పెరగనున్నాయి. తక్షణం ధరల పెంపు నిర్ణయం అమల్లోకి వస్తుందని ఎం అండ్ ఎం తెలిపింది.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో స్టీల్, అల్యూమినియం, పల్లాడియం తదితర కీలక ముడి సరుకు ధరలు పెరుగుతుండటంతో కార్ల ఉత్పాదక వ్యయం కూడా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో వాహనాల కొనుగోలుదారులపై ఈ ధరల ప్రభావం పడుతుందని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది.
ఇంతకుముందు టాటా మోటార్స్, మారుతిసుజుకిలతోపాటు ప్రముఖ కార్ల తయారీ సంస్థలు టయోటా కిర్లోస్కర్ మోటార్స్, బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెజ్-బెంజ్ సంస్థలు ఏప్రిల్ నుంచి కార్ల ధరలు పెంచేశాయి.