న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన వల్ల, నిర్దిష్ట పన్ను చెల్లింపుదారుల కస్టమర్ చిరునామాలను అప్డేట్ చేయకపోవడం వల్ల భారీగా ఆదాయం దారి మళ్లుతున్నదని జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తీసుకెళ్లారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పన్ను చెల్లింపుదారుల రికార్డుల్లోని కస్టమర్ చిరునామాలు తెలంగాణలో ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్గానే పరిగణలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ విషయంలో ప్రతిపాదిత కొత్త 3B ఫారమ్లో GSTR 3B రిటర్న్లలో ప్రతికూల విలువలను(నెగిటీవ్ వాల్యూను) అనుమతించాలని ప్రతిపాదించినందుకు కౌన్సిల్కు హరీశ్రావు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత 3బి రిటర్న్లో కూడా అదే సదుపాయాన్ని పొందుపరచాలని జీఎస్టీ కౌన్సిల్ ఛైర్పర్సన్ను మంత్రి కోరారు. తద్వారా ప్రస్తుత సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుల చిరునామాల తప్పులను సరిద్దిద్దడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.
ఈ నెల 28, 29 తేదీల్లో చండీగఢ్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 47వ GST కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావుతో పాటు ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రం తరపున పలు అంశాలను మంత్రి హరీశ్ రావు జీఎస్టీ కౌన్సిల్ లో ప్రస్తావించారు.
మళ్లించబడిన ఐజిఎస్టిని రికవరీ చేయడానికి రాష్ట్రం వెలుపల ఉన్న పన్ను చెల్లింపుదారుల టాక్స్ జ్యూడిరిక్షన్ విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఢిల్లీ రాష్ట్రాల అధికారుల సహకారం కావాలని హరీశ్రావు కోరారు. ఈ విషయంలో రెవెన్యూ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర , కర్ణాటక అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. పన్ను చెల్లింపుదారులపై మళ్లీ ఐజిఎస్టి చెల్లింపుతో భారం పడకుండా, ఇప్పటికే చెల్లించిన పిఒఎస్తో ఐజిఎస్టిని వాపసు చేయాలని కోరారు.
స్థానిక సంస్థల విధులకు సంబంధించి అందించిన స్వచ్ఛ పరికరాలకు సంబంధించిన మినహాయింపుల జాబితాను విస్తరించాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, జీఎస్టీ చైర్పర్సన్ను కోరారు. లేకుంటే అది స్థానిక సంస్థలపై భారం పడుతుందని వివరించారు. ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో స్థానిక సంస్థలు ఉన్నాయని తెలిపారు. మినహాయింపు జాబితా విస్తరణపై పరిశీలన జరపడంతో పాటు వివరణాత్మక అధ్యయనం కోసం ఫిట్మెంట్ కమిటీకి పంపి, కొత్త ప్రతిపాదనను రూపొందించాలని సూచించారు.
GST అప్పీలేట్ నిబంధనలకు సంబంధించిన విషయాన్ని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈ సమావేశంలో లేవనెత్తారు. ప్రతిపాదిత నిబంధనలు గజిబిజిగా ఉన్నాయని, ఆచరణాత్మకంగా లేవని చెప్పారు. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ చైర్ పర్సన్ సైతం అంగీకరించారు. అప్పిలేట్ నిబంధనలపై, అప్పిలేట్ ట్రిబ్యునల్ GoMకి అప్పగించడం జరిగింది. 2022 ఆగస్టు 1వ తేదీలోగా ప్రతిపాదనలు సమర్పించాలని GoMని జీఎస్టీ కౌన్సిల్ ఛైర్ పర్సన్ ఆదేశించింది.
కాసినోలు, గుర్రపు పందాలు, ఆన్లైన్ గేమింగ్లపై GoM యొక్క ప్రతిపాదనలకు సంబంధించి, గోవా అభ్యర్థనకు స్పందించి కాసినోవాలను ఆమోదించినట్లు, గుర్రపు పందాల విషయంలోను జీవోఎంకు మళ్లీ సూచించాలని జీఎస్టీ ఛైర్ పర్సన్ను కోరారు. ఇందుకు జీఎస్టీ ఛైర్ పర్సన్ అంగీకరించారు. దీనిపై జులై 15వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని చెప్పారు.