హైదరాబాద్, జూలై 15(నమస్తే తెలంగాణ): ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా మీలా జయదేవ్ శనివారం బాధ్యతలు చేపట్టారు. సుధాకర్ పీవీసీ కంపెనీ ఎండీగా వ్యవహరిస్తున్న ఆయన 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను అధ్యక్షుడిగా కొనసాగుతారు. శనివారం రెడ్హిల్స్లోని ఫెడరేషన్ భవన్లో జరిగిన సమావేశంలో నూతన కార్యకవర్గాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు అనిల్ అగర్వాల్ నుంచి సుధాకర్ జయదేవ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు ఎఫ్టీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, సురేశ్ కుమార్ సింఘాల్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు వారు పేర్కొన్నారు.