న్యూఢిల్లీ, మే 29: ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన గ్లోస్టర్లో సరికొత్త మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది ఎంజీ మోటర్ ఇండియా. ఈ కారు ప్రారంభ ధర రూ.40.29 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
అడ్వాన్స్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్(ఏడీఏఎస్) లెవల్-1 కలిగిన తొలి ఎడిషన్ ఇదేనని కంపెనీ వెల్లడించింది. కంఫర్ట్, లగ్జరీ, అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఈ మాడల్ను 2 లీటర్ల డీజిల్ ఇంజిన్తో రూపొందించింది. 30 భద్రత ఫీచర్ కలిగివుండటం విశేషం.