హైదరాబాద్, ఏప్రిల్ 6: బంగారు ఆభరణాల విక్రయ సంస్థ మెలోరా.. తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను గురువారం హైదరాబాద్లో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సంస్థకు ఇది 24 సెంటర్ కావడం విశేషం. ఈ సందర్భంగా మెలోరా సీఈవో సరోజా మాట్లాడుతూ..తెలంగాణలో ఆన్లైన్లో ఆభరణాల కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్రాంచైజ్ స్టోర్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే మార్చి నాటికి హైదరాబాద్లోనే ఐదు నుంచి ఆరు ఎక్స్పీరియన్స్ సెంటర్లను నెలకొల్పాలనుకుంటున్నట్టు తెలిపారు. అలాగే వచ్చే ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 500 స్టోర్లను నెలకొల్పాలని, తద్వారా బిలియన్ డాలర్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆమె తెలిపారు.