న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ దేశీయ మార్కెట్కు మినీ బస్సును పరిచయం చేసింది. బడ్జెట్-ఫ్రెండ్లీ కమర్షియల్ వాహన ఫీచర్స్ కలిగిన మినీ బస్సులో 12 నుంచి 15 మంది ప్రయాణికులు కూర్చోవడానికి వీలుంటుంది.
ఈ బస్సు ప్రారంభ ధర రూ.4.99 లక్షలుగా నిర్ణయించింది. సిటీ ట్రావెల్, స్కూల్, ఉద్యోగుల రవాణాకోసం వినియోగించే ఈ మినీ బస్సు లీటర్ పెట్రోల్కు 28 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. ఈ బస్సు దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న రిటైల్ అవుట్లెట్లలో లభించనున్నది. ఈ బస్సుపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై కంపెనీ స్పందించలేదు.