న్యూఢిల్లీ: స్మార్ట్ వాచ్ బ్రాండ్స్ సేల్స్ 2021 ద్వితీయ త్రైమాసికంలో 46 శాతం గ్రోత్ సాధించాయి. మొత్తం స్మార్ట్ వాచ్ మార్కెట్లో ఆపిల్ స్మార్ట్ వాచ్లు 52 శాతం వాటా పొందాయి. తర్వాతీ స్థానాల్లో శ్యామ్సంగ్, గర్మీన్ నిలిచాయని న్యూ స్ట్రాటర్జీ అనలిటిక్స్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ మాస్టాన్ తెలిపారు. గతేడాది 65 లక్షల ఆపిల్ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జరిగితే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 95 లక్షలకు చేరుకున్నాయి.
ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ వాచ్గా ఆపిల్ వాచ్ సిరీస్ 6 మోడల్ నిలిచింది. హెల్త్ అండ్ ఫిట్నెస్ యాప్స్ పోర్ట్ ఫోలియోలో స్మాల్ స్క్రీన్పై మంచి వాడకం, సొగసైన డిజైన్ కలిగి ఉన్న వాచ్గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ వాచ్ సేల్స్.. కరోనా ముందు స్థాయికి చేరుకున్నాయి.
శ్యామ్సంగ్ స్మార్ట్ వాచ్ విక్రయాలు 13 లక్షల నుంచి 20 లక్షల (54 శాతం గ్రోత్)కు చేరుకున్నాయి. నార్త్ అమెరికా, యూరప్, దక్షిణ కొరియా మార్కెట్లలో శ్యామ్సంగ్ తన పట్టును కొనసాగిస్తున్నది. గ్లోబల్ స్మార్ట్ వాచ్ల సేల్స్లో శ్యామ్సంగ్ వాటా 11 శాతం. తర్వాత స్థానంలో ఉన్న గార్మిన్ స్మార్ట్ వాచ్ సేల్స్ 12 లక్షల నుంచి 15 లక్షలకు చేరుకుని 25 శాతం పురోగతి సాధించాయి.