న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్ట్లో లాంఛ్ అయి, ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమైన మహీంద్రా ఎక్స్యూవీ700కి కస్టమర్ల నుంచి బంపర్ రెస్పాన్స్ లభిస్తోంది. బుకింగ్స్ ప్రారంభమైన 60 నిమిష్లాలోనే 25,000 ఆర్డర్లు రావడం, ఆపై ప్రవేశ ఆఫర్ ధర ముగిసి ధరలు పెరిగినా ఎస్యూవీకి డిమాండ్ కొనసాగుతోంది. భారత్లో ఎక్స్యూవీ700 బుకింగ్స్ 65,000 మార్క్ చేరుకున్నాయని కంపెనీ వెల్లడించింది.
ఎస్యూవీకి భారత్లో అధిక డిమాండ్ ఉండటం, చిప్ కొరత వంటి కారణాలతో దేశంలో ఎక్స్యూవీ700 డెలివరీల్లో జాప్యం జరుగుతోంది. అయితే మహీంద్ర ఎక్స్యూవీ700 పెట్రోల్ మోడల్స్ డెలివరీ ఈనెల 30 నుంచి ప్రారంభమవుతుందని, డీజిల్ వేరియంట్స్ ఈ ఏడాది నవంబర్ చివరి వారం నుంచి మొదలవుతాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కాగా భారత్లో మహీంద్ర ఎక్స్యూవీ700 రూ 12.49 లక్షల నుంచి రూ 22.99 (ఎక్స్షోరూం, ఇండియా) లక్షల మధ్య అందుబాటులో ఉంటుంది.