ముంబై, మార్చి 27: హిందూజా గ్రూప్ సంస్థ జీవోసీఎల్.. కూకట్పల్లిలో భారీ ఎత్తున ఉన్న తమ భూమిని అమ్మేస్తున్నది. రూ.3,402 కోట్లకు దాదాపు 264.50 ఎకరాల స్థలాన్ని విక్రయించేందుకు జీవోసీఎల్ సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్కు చెందిన స్కేర్స్పేస్ బిల్డర్స్తో ఒప్పందం చేసుకున్నట్టు బుధవారం ఆ సంస్థ తెలిపింది. ఈ డీల్లో హిందూజా హెల్త్కేర్ లిమిటెడ్తో కలిసి జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద ఉన్న 32 ఎకరాలు కూడా ఉన్నాయి. ఇదిలావుంటే దశలవారీగా ఈ లావాదేవీ ముగియనుండగా, తొలి విడుత కింద రూ.520 కోట్లు రానున్నాయి.