రూ.51.40 కోట్ల విలువైన 14 ఆస్తుల స్వాధీనం
హైదరాబాద్, మార్చి 26, (నమస్తే తెలంగాణ): బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న కయోరి ఓరేమిన్ లిమిటెడ్ (కేవోఎల్) కంపెనీ డైరెక్టర్ ఇషో నారంగ్కు చెందిన రూ.51.40 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం జప్తు చేసింది. వీటిలో ఏపీలోని విజయనగరం, తెలంగాణలో శంకరపల్లిలోని మొత్తం 14 స్థిరాస్థులున్నట్టు అధికారులు వెల్లడించారు. రూ.62.75 కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేతపై కేవోఎల్పై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో బెంగళూరులోని సీబీఐ విభాగం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.