Kia Motors | న్యూఢిల్లీ, మార్చి 29: కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా దూకుడును పెంచింది. దేశవ్యాప్తంగా కంపెనీ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో వీటిని విక్రయించడానికి మరిన్ని టచ్పాయింట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివరినాటికి 300 నగరాల్లో 700 సేల్స్ అండ్ సర్వీస్ టచ్పాయింట్లను నెలకొల్పాలనుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం 236 నగరాల్లో 522 టచ్పాయింట్లను నిర్వహిస్తున్నది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై ప్రత్యేక దృష్టి సారించడంలో భాగంగా మొత్తం షోరూంలలో 40 శాతం ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కియా ఇండియా నేషనల్ హెడ్ హర్దీప్ సింగ్ తెలిపారు.