న్యూఢిల్లీ, జూలై 4: మధ్యస్థాయి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన సెల్టోస్ను ఆధునీకరించి మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది కియా ఇండియా. లోపలి భాగాన్ని నూతనంగా డిజైన్ చేసిన సంస్థ.. పలు భద్రత ఫీచర్లు, 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్తో రూపొందించింది.
ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ విభాగాల్లో విడుదల చేసింది. ఈ సందర్భంగా కియా ఇండియా ఎండీ, సీఈవో థై-జిన్ పార్క్ మాట్లాడుతూ.. దేశీయ ప్యాసింజర్ వాహన విభాగంలో 10 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఇందుకు తగ్గట్టుగానే ప్రణాళికలను మరింత వేగవంతం చేసినట్లు చెప్పారు.