Jan-Dhan accounts | న్యూఢిల్లీ, ఆగస్టు 26: అందరికి ఆర్థిక సేవలు అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్ ధన్ ఖాతాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 50 కోట్ల జన్ ధన్ ఖాతాలు కలిగివున్నాయి. ఈ ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు రూ.2.03 లక్షల కోట్లు డిపాజిట్ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆగస్టు 28, 2014న పీఎంజేడీవై పథకాన్ని ప్రకటించినది తెలిసిందే. వీటిలో ఇప్పటి వరకు 33.98 కోట్ల రూపే కార్డులను జారీ చేశామని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు.
ప్రస్తుతం భారత్లో 225 కోట్ల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, వీటిలో ప్రజలు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగివున్నారని చెప్పారు. ప్రతియేటా 2.5 కోట్ల నుంచి 3 కోట్ల జన్ ధన్ ఖాతాలు ప్రారంభమవుతున్నాయని, గడిచిన తొమ్మిదేండ్లలో 50 కోట్లు దాటాయన్నారు. మార్చి 2015లో సరాసరిగా ఒక్కో ఖాతాలు రూ.1,065 ఉన్న డిపాజిట్లు..ఆగస్టు 2023 నాటికి 3.8 రెట్లు పెరిగి రూ.4,063కి చేరుకున్నాయి.