న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ఆశాజనక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.392 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.327 కోట్ల లాభంతో పోలిస్తే 20 శాతం వృద్ధి కనబరిచింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం బ్యాంక్కు లాభించింది.
బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.5,607 కోట్ల నుంచి రూ.5,028 కోట్లకు పరిమితమైంది. బ్యాంక్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ.1,202 కోట్ల నుంచి రూ.1,026 కోట్లకు పడిపోయింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 11.48 శాతం నుంచి 9 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 3.15 శాతం నుంచి 2.43 శాతానికి దిగొచ్చాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ కేవలం రూ.132.73 కోట్లు మాత్రమే కేటాయించింది.