Stock Markets | మూడు రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు రూ.5.58 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావం నేపథ్యంలో శుక్రవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్ల మీద పడింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 1210.96 పాయింట్లు (2.20 శాతం) నష్టపోయి 53,887.72 పాయింట్ల వద్దకు పడిపోయింది. తిరిగి ట్రేడింగ్ ముగిసే సమయానికి 768.87 పాయింట్లు (1.40 శాతం) నష్టంతో 54,333.81 పాయింట్ల వద్ద స్థిరపడింది. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,913.47 పాయింట్ల వద్ద ముగిసింది. ఫలితంగా మూడు రోజుల్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,59,623.71 కోట్ల నుంచి రూ.2,49,79, 421.38 కోట్లకు పడిపోయింది.
శుక్రవారం ట్రేడింగ్లో టైటాన్, మారుతి సుజుకి ఇండియా, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందూస్థాన్ యూనీ లివర్ భారీగా 5.05 శాతం వరకు పతనం అయ్యాయి. బ్రాడర్ మార్కెట్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్ స్క్రిప్ట్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ 2.36 శాతం పతనం అయ్యాయి. ఆటో, మెటల్, కన్జూమర్, గూడ్స్ అండ్ సర్వీసెస్, కన్జూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ షేర్లు 3.40 శాతం వరకు నష్టపోయాయి. గురువారం సెషన్లో బీఎస్ఈ 366.22 పాయింట్ల నష్టంతో 55,102.68 పాయింట్ల దిగువకు పడిపోయింది.