న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.7,969 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,128 కోట్ల లాభంతో పోలిస్తే 30 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 1.3 శాతం ఎగబాకి రూ.37,441 కోట్ల నుంచి రూ.37,923 కోట్లకు చేరుకున్నది.
‘వచ్చే ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకునే అవకాశాలున్నాయి. ఇండస్ట్రీస్, ఆర్థిక సే వల విభాగాలకు పెరుగుతున్న డిమాం డే కారణం. తయారీ రంగం గతేడాది కంటే తక్కువ వృద్ధిని నమోదు చేసుకోవచ్చును. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చులను తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యతనిస్తాం.
-సలీల్ పరేఖ్,ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవో