Vistara | టాటా సన్స్ అనుబంధ ఎయిర్లైన్స్ విస్తారా కీలక నిర్ణయం తీసుకున్నది. ఫ్రాంక్ఫర్ట్, పారిస్ రూట్లలో విమాన సర్వీసులు డబుల్ చేయనున్నది. ఇందుకోసం బోయింగ్ 787 విమానాన్ని లీజ్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆరు డ్రీమ్లైనర్ల కోసం బోయింగ్ సంస్థ యాజమాన్యానికి ఆర్డర్ పెట్టింది. కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో బోయింగ్.. డ్రీమ్లైనర్లు డెలివరీ చేయలేదు.
ఈ బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ విమానంతో అక్టోబర్ 30 నుంచి ఢిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వరకు వారానికి ఆరు విమాన సర్వీసులు నడుపనున్నది. ఇప్పటి వరకు వారానికి మూడు సర్వీసులు మాత్రమే నడిపింది. ఢిల్లీ-పారిస్ మధ్య వారానికి రెండు నుంచి ఐదు విమాన సర్వీసులు నడుపనున్నది.
ఇప్పటివరకు విస్తారా వద్ద రెండు బీ787 బోయింగ్ డ్రీమ్లైనర్లు ఉన్నాయి. కొన్ని నెలల పాటు డ్రీమ్లైనర్ విమానాన్ని లీజ్కు తీసుకోవాలని విస్తారా నిర్ణయించింది. తద్వారా ఉత్తర అమెరికా దేశాలకు నాన్స్టాప్ విమాన సర్వీసులు నడుపనున్నది.