Indian Oil Corporation | ముడి చమురు సరఫరా కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) నూతన క్రూడాయిల్ పైప్లైన్ ఏర్పాటు చేయనున్నది. గుజరాత్లోని ముంద్రా నుంచి హర్యానాలోని పానీపట్ వరకు ఈ పైప్లైన్ ఏర్పాటు చేస్తుంది. ఏటా 17.5 మిలియన్ టన్నుల ముడి చమురు సరఫరా చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది.
అంతే కాదు.. ముంద్రాలో మరో తొమ్మిది క్రూడాయిల్ ట్యాంకులను నిర్మించబోతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఆపరేషనల్, స్టోరేజీ అవసరాల కోసం వీటిని నిర్మించనున్నది. ఒక్కో ట్యాంక్ సామర్థ్యం 60 వేల కిలోలీటర్లు. దీనికయ్యే ఖర్చు రూ.9.028 కోట్లు. ఈ మేరకు ఐవోసీ పాలక మండలి ఈ నెల 20న ఆమోద ముద్ర కూడా వేసింది.
పానీపట్లోని రిఫైనరీ సామర్థ్యాన్ని పెంచనున్నది ఐవోసీ. ఇప్పుడు ఉన్న ఎంఎంటీపీఏ నుంచి 25 ఎంఎంటీపీఏకు పెంచనున్నది. ఇందుకోసం పాలిప్రొపిలైన్ యూనిట్, క్యాటల్యిటిక్ డివాక్సింగ్ యూనిట్ నిర్మించనున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం నాటికి అంటే 2024 జూలై-సెప్టెంబర్ మధ్య వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.