Gaming Sector | న్యూఢిల్లీ, మార్చి 27: దేశీయ గేమింగ్ రంగం దూసుకుపోతున్నది. 2028 నాటికి దేశీయ గేమింగ్ రంగ సంస్థల ఆదాయం రెండింతలు పెరిగి 6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సర్వే అంచనావేస్తున్నది. 2023లో 1.3 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆదాయం వచ్చే ఐదేండ్లలో రెండింతలు పెరగనున్నదని ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్, ఆన్లైన్ గేమింగ్ వింజో సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
అలాగే ప్రస్తుతం 14.4 కోట్లుగా ఉన్న గేమింగ్ ఆడేవారి సంఖ్య వచ్చే ఐదేండ్లలో 24 కోట్లకు చేరుకుంటారని అంచనావేస్తున్నది. ప్రస్తుతం భారత్లో 1,400 గేమింగ్ కంపెనీలు ఉండగా, 500 గేమింగ్ స్టూడియోలున్నాయి.