న్యూఢిల్లీ, జూలై 23: ల్యాంకో ఇన్ఫ్రాటెక్, బసుంధర గ్రీన్ పవర్లను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఇండియన్ బ్యాంక్.. శుక్రవారం మోసపూరిత ఖాతాలుగా ప్రకటించింది. ఈ సంస్థలు బ్యాంక్కు రూ.589 కోట్లకుపైగా బకాయి పడ్డాయని తెలిపింది. రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఈ ఖాతాల వివరాలను తెలియజేశామంటూ ఎక్సేంజ్లకు బ్యాంక్ సమాచారమిచ్చింది. బ్యాంక్కు ల్యాంకో ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ రూ.577.47 కోట్లు, బసుంధర గ్రీన్ పవర్ లిమిటెడ్ రూ.11.64 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ల్యాంకో నిధుల మళ్లింపునకు పాల్పడగా, బసుంధర టైటిల్ డీడ్, మార్ట్గేజ్ అవకతవకలు చేసింది.