ముంబై, సెప్టెంబర్ 12 : దేశీయ ఆభరణాల ఎగుమతులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆగస్టు నెలలో 2.30 బిలియన్ డాలర్లు(రూ.21,945.87 కోట్లు) విలువైన జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతులు జరిగాయని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) తాజాగా వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో ఎగుమతైన 2.23 బిలియన్ డాలర్లు(రూ.19,503.52 కోట్లు) తో పోలిస్తే 3.14 శాతం పెరిగాయి.
మొత్తంమీద గత నెలలో బంగారు ఆభరణాల ఎగుమతులు 11.81 శాతం ఎగబాకి 999.83 మిలియన్ డాలర్లు(రూ.9,546.12 కోట్లు)కు చేరుకున్నాయి. ప్రధానంగా అమెరికా, హాంకాంగ్, సింగపూర్, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో దేశీయ బంగారు ఆభరణాలకు డిమాండ్ అధికంగా ఉండటం వల్లనే వృద్ధి నమోదైందని పేర్కొంది. వీటిలో సాదా బంగారు ఆభరణాల ఎగుమతులు 23.90 శాతం తగ్గి 356.97 మిలియన్ డాలర్ల(రూ.3,408.32 కోట్లు)కు పడిపోయాయి.