దీర్ఘకాలికంగా భారతీయులు పసిడిని పెట్టుబడిగా వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో టెక్నాలజీ రంగం రూపాంతరం చెందడంతో పసిడిపై పెట్టుబడుల తీరు మారిపోయింది. ఎంతమారినప్పటికీ బంగారం కొనుగోళ్ళు తగ్గకపోయినప్పటికీ..ఇదే సమయంలో డిజిటల్ ద్వారా కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వీటిలో గోల్డ్ బాండ్లు లేదా గోల్డ్ ఈటీఎఫ్లు. ప్రత్యక్ష పసిడి కొనుగోళ్ళను నియత్రించాలనే ఉద్దేశంతో రిజర్వు బ్యాంక్ సావరిన్ గోల్డ్ బాండ్ల(ఎస్జీబీ)ని ప్రవేశపెట్టగా.. అలాగే మ్యూచువల్ ఫండ్ మాత్రం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లను జారీ చేసింది. దీర్ఘకాలిక, పన్ను ప్రయోజనాలు పొందాలంటే ఎస్జీబీలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పసిడి బాండ్లపై వచ్చే వడ్డీ మాత్రం పన్ను పరిధిలోకి వస్తుండటంతో పెట్టుబడిదారులు పెద్దగా ఆసక్తిచూపడం లేదు. కానీ, గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి ఎంతమేర పెట్టుబడులు పెట్టవచ్చు. వీటిని భౌతికంగాను, ఎలక్ట్రానిక్ పద్దతిన కొనుగోలు చేయవచ్చును. ఈ గోల్డ్ ఈటీఎఫ్లు నేరుగా షేరు మార్కెట్లోకి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.
పసిడి రుణాలపై వడ్డీరేట్లు ఇలా..
పసిడిపై అన్ని బ్యాంకులపై రుణాలు ఇస్తున్నాయి. ఆయా బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లలో వ్యత్యాసం అధికంగా ఉంటున్నది. ప్రధాన బ్యాంకు లు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుండగా..ప్రైవేట్ సం స్థలు మాత్రం అధికంగా వడ్డీని వసూలు చేస్తున్నాయి. వీటితోపా టు చార్జీలు వసూ లు చేస్తున్నాయి. వీటిలో ఇండియన్ బ్యాంక్ 7 శాతం ఫ్లోటింగ్ రేటును వసూలు చేస్తుండగా..సెంట్రల్ బ్యాంక్ 7.10 శాతం నుంచి 7.20 శాతంలోపు, యూనియన్ బ్యాంక్ 7.25 శాతం నుంచి 7.50 శాతం, యూకో బ్యాంక్ 7.40 శాతం నుంచి 7.90 శాతం లోపు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 7.60 శాతం నుంచి 16.80 శాతం లోపు వసూలు చేస్తున్నాయి. ఇలా తీసుకున్న రుణాలపై నెల లేదా మూడు నెలలకొకసారి తిరిగి చెల్లింపులు జరుపుకోవచ్చును. వ్యాపార, ఆరోగ్య అవసరాల నిమిత్తం అత్యవసరంగా డబ్బు కావాలంటే పసిడిని తాకట్టుపెట్టుకొని రుణం తీసుకోవడం సులభం. బంగారంపై తీసుకున్న రుణం మొత్తం చెల్లించిన తర్వాత వారి ఆభరణాలు తిరిగి ఇవ్వనున్నాయి. ఒకవేళ చెల్లించకపోతే మధ్యలోనే వాటిని వేలం వేసే అధికారం ఆర్థిక సంస్థలకు ఉంటుంది.