Twitter Parag Agarwal wife role | మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ను టెస్లా సీఈవో ఎలన్మస్క్ టేకోవర్ చేసుకోవడం దాదాపు ఖాయమైంది. ట్విట్టర్ను అధికారికంగా మస్క్ తన ఆధీనంలోకి తీసుకున్నాక.. ప్రస్తుత సీఈవో పరాగ్ అగర్వాల్ను కొనసాగిస్తారా? అన్న విషయమై అనిశ్చితి కొనసాగుతున్నది. ప్రస్తుత మేనేజ్మెంట్పై నమ్మకం విశ్వాసం లేదని మస్క్ చెబుతున్నారు. సీఎన్బీసీలో ట్విట్టర్ను స్వాధీనం చేసుకున్న తర్వాత కొంత కాలం తానే సీఈవోగా కొనసాగాలని ఎలన్మస్క్ భావిస్తున్నారని వార్తా కథనం వచ్చింది.
ట్విట్టర్ను టేకోవర్ చేయడానికి ఎలన్మస్క్ చేస్తున్న ప్రయత్నాల్లో ఆండ్రీసీన్ హోరోవిట్జ్ మద్దతుదారుగా నిలిచారు. తానుగా 400 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించారు. ప్రపంచంలో సాహసోపేతమైన, తెలివైన, నైపుణ్యం గల వ్యక్తి ఒక్కరే ఒక్కరు ఉన్నారు. ఆయనే ఎలన్మస్క్ అని హోరోవిట్జ్ ట్వీట్ చేశారు.
మస్క్ ట్విట్టర్ను టేకోవర్ చేసుకున్న తర్వాత అండ్రీస్సీన్ హోరోవిట్జ్ వెంచర్ సంస్థ, అందులో భాగస్వాములతో ఆయన సంబంధ బాంధవ్యాలు సంక్షోభంలో చిక్కుకోనున్నాయి. హోరోవిట్జ్ జనరల్ పార్టనర్స్లో వినీతా అగర్వాల్ ఒకరు. హోరోవిట్జ్ బయోటెక్, మెడికల్ కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు. ఆయన వెంచర్ కంపెనీల్లో వినీతా అగర్వాల్ కూడా జనరల్ పార్టనర్గా ఉండటం గమనార్హం.