హైదరాబాద్, మే 17: ఎయిర్ ట్యాక్సీతోపాటు అత్యవసర వైద్య సేవలు అందించడానికి ప్రణాళిలకు రూపొందిస్తున్నట్లు డ్రోగో డ్రోన్స్ సీఈవో యశ్వంత్ బొంతు తెలిపారు. దేశవ్యాప్తంగా 30 లక్షల ఎకరాల్లో క్రిమి సంహారక మందులు పిచికారీకి ఇఫ్కోతో ఒప్పందం చేసుకోవడంతోపాటు వ్యవసాయ రంగంలో విసృతమైన సేవలు అందించే కృషీ 3 డ్రోన్కు పౌర విమానయాన సంస్థ డైరెక్టర్ ఆఫ్ జనరల్(డీజీసీఏ) అనుమతిచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..సర్వే, మ్యాపింగ్, ఉత్పత్తుల రవాణా మరికొన్ని ఇతర రంగాలకు డ్రోన్స్ సేవలను విస్తరించనున్నట్లు ప్రకటించారు. కృషీ 3 డ్రోన్ ఒకసారి చార్జింగ్ చేస్తే నాలుగు ఎకరాల్లో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయనున్నది.