న్యూఢిల్లీ: టాటా సన్స్ అనుబంధ టాటా కమ్యూనికేషన్స్లో కేంద్రం 10 శాతం వాటాను వదులకున్నది. టాటా సన్స్ అనుబంధ సంస్థ పనాటోన్ ఫిన్వెస్ట్కు ఆఫ్ మార్కెట్ ట్రేడ్ కింద కేంద్రం తన 10 శాతం వాటాను విక్రయించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వానికి టాటా కమ్యూనికేషన్స్లో ఉన్న 16.12 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రిటైల్, నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు ఈక్విటీకి రూ.1,161 చొప్పున విక్రయించింది.
ఇక టాటా కమ్యూనికేషన్స్లో పనాటోన్ ఫిన్వెస్ట్కు 34.80 శాతం, టాటా సన్స్కు 14.07 శాతం వాటాలు ఉన్నాయి. మిగతా 25.01 శాతం వాటా ఇన్వెస్టర్లు కలిగి ఉన్నారు. టాటా కమ్యూనికేషన్స్లో 10 శాతం వాటాకు సమానమైన 2,85,00,000 ఈక్విటీ షేర్లను ఆఫ్ మార్కెట్ ట్రేడ్ ద్వారా గురువారం విక్రయించామని కేంద్ర టెలికం శాఖ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. టాటా కమ్యూనికేషన్స్ను టాటా సన్స్ ఏర్పాటు చేసిన తర్వాత 2002లో కేంద్రం వాటాలను కొనుగోలు చేసింది.