Google CEO : టెక్ దిగ్గజాలు తమ దైనందిన జీవితంలో టెక్నాలజీని ఎలా వినియోగిస్తారనే దానిపై అందరిలో ఆసక్తి ఉంటుంది. గూగుల్, అల్పాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన టెక్నాలజీ అలవాట్ల గురించి ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. ఓసారి తాను వివిధ కారణాలతో ఏకంగా 20కిపైగా ఫోన్లు వాడానని గుర్తుచేసుకున్నారు. ఈ రోజుల్లో చాలామంది వ్యక్తులు ఒక ఫోన్నే హ్యాండిల్ చేయలేని పరిస్ధితుల్లో సుందర్ పిచాయ్ వెల్లడించిన వివరాలు ఆశ్చర్యానికి లోనుచేస్తాయి.
గూగుల్ ఉత్పత్తులు విభిన్న డివైజ్లపై మెరుగ్గా పనిచేస్తున్నాయా అని పసిగట్టే క్రమంలో తన పనిలో భాగంగా సుందర్ పిచాయ్ ఇలా చేయాల్సి వచ్చింది. లేటెస్ట్ టెక్నాలజీపై ఎంత అప్టూడేట్గా సుందర్ పిచాయ్ ఉంటారో, వినూత్న పోకడలతో గూగుల్ ముందుకెళ్లడంపై ఆయన ఎలా దృష్టిసారిస్తారనేది ఇది వెల్లడిస్తుంది. సుందర్ పిచాయ్ టెక్ అలవాట్లు కేవలం తన ఫోన్ కలెక్షన్స్ దగ్గరే ఆగిపోలేదు. తన పిల్లలు స్క్రీన్స్పై ఎంత సమయం గడుపుతారని ప్రశ్నించగా ఇది వ్యక్తిగత పరిమితులకు సంబంధించినదని, కేవలం కఠిన నియమాలతో కూడినది కాదని పిచాయ్ బదులిచ్చారు.
సాంకేతికతను బాధ్యతతో వాడటం కీలకమని ఆయన చెప్పుకొచ్చారు. తాను తరచూ పాస్వర్డ్స్ మార్చనని కూడా పిచాయ్ పేర్కొన్నారు. పిచాయ్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా కొన్నిభారీ ఆలోచనలు ఉన్నాయి. ఏఐ అనేది మానవత్వం సృష్టించే అత్యంత ముఖ్యమైన సాంకేతికతని తాను భావిస్తానని అన్నారు. దాని ప్రభావాన్ని ఆయన అగ్ని, విద్యుత్ వంటి వాటితో పోల్చడం గమనార్హం.
Read More :
iPhone 15 | వాలంటైన్స్ డే సందర్భంగా ఐ-ఫోన్ 15పై బంపరాఫర్.. ఇవీ డిటైల్స్..!