న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రో..ఉద్యోగులకు శుభవార్తను అందించింది. పనితీరు ఆధారంగా వేతనపెంపు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని సిబ్బంది ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం అందించింది. వేతన పెంపునకు సంబంధించి ఇప్పటికే పలువురు సిబ్బందికి ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించిన సంస్థ..
మరికొన్ని రోజుల్లో మిగతావారికి కూడా తెలియచేయనున్నది. ఈ సందర్భంగా విప్రో మానవ వనరుల విభాగ అధిపతి సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ.. పనితీరు ఆధారంగా 96 శాతం మంది సిబ్బందికి వేతనాన్ని పెంచినట్లు చెప్పారు. ఎంతమేర పెంచిన విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.